బిజినెస్

‘జిఎస్‌టి ఆదాయంపైనే ఆధారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఆగస్టు 12: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) శ్లాబుల హేతుబద్ధీకరణ, రాబోయే రోజుల్లో దాని ఆదాయంపై ఆధారపడి ఉందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
శనివారం ఇక్కడ జరిగిన ఓ సెమినార్‌లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ జిఎస్‌టి నెట్‌వర్క్ వ్యవస్థ బాగుందన్నారు. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో దేశవ్యాప్తంగా గత నెల జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పరోక్ష పన్నుల విధానంలో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు.
ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, జిఎస్‌టి అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తొలి ఐదేళ్లు నష్టపరిహారం కూడా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
ఈ క్రమంలోనే లగ్జరీ, ఆరోగ్యానికి హానికరం చేసే ఉత్పత్తులపై 28 శాతం గరిష్ఠ పన్నుకుతోడు 43 శాతం వరకు అదనంగా పన్ను భారాన్ని మోపింది మోదీ సర్కారు.