బిజినెస్
‘ఈ-స్కూటర్లకు రూ. 40 వేల రాయితీ ఇవ్వాలి’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 20 August 2017
న్యూఢిల్లీ, ఆగస్టు 20: తమకు రాయతీలు పెంచాలని ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు నీతి ఆయోగ్కు విజ్ఞప్తి చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణార్థం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది తెలిసిందే. అయితే ఒక్కో వాహనం తయారీ వ్యయం దాదాపు 80,000 రూపాయల మేర ఉండటంతో 40,000 రూపాయల వరకు రాయితీలు ఇస్తే బాగుంటుందని, దానివల్ల ధరలు తగ్గి ఎలక్ట్రిక్ వాహనాల (ఈ-స్కూటర్లు) వాడకం పెరుగుతుందని, తద్వారా కాలుష్యాన్నీ తగ్గించినవారమవుతామని ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల సంఘం నీతి ఆయోగ్ను కోరింది. కాగా, ప్రస్తుతం ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై 22,000 రూపాయల రాయితీని అందిస్తోంది.