బిజినెస్
‘మరింత పెరగనున్న మొండి బకాయిలు’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 15 May 2016
న్యూఢిల్లీ, మే 14: బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పిఎ) వచ్చే ఏడాది మార్చికల్లా 6.9 శాతానికి ఎగబాకవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. నిరుడు సెప్టెంబర్ నాటికి వాణిజ్య బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 5.14 శాతంగా ఉన్నాయని, ఈ ఏడాది సెప్టెంబర్కు 5.40 శాతానికి పెరగవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నివేదికను ఊటంకిస్తూ 2015-16 వార్షిక నివేదికలో ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను మొండి బకాయిలు ప్రమాదంలో పడేసినది తెలిసిందే.