బిజినెస్

జిఎస్‌టిఎన్ మధ్యంతర చైర్మన్‌గా పాండే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్ (జిఎస్‌టిఎన్) మధ్యంతర చైర్మన్‌గా యుఐడిఎఐ సిఇఒ ఎబి పాండే శుక్రవారం నియమితులయ్యారు. గత నెల 29న జిఎస్‌టిఎన్ తొలి చైర్మన్ నవీన్ కుమార్ పదవీకాలం పూర్తవడంతో ఏర్పడిన ఖాళీని పాండేతో తాత్కాలికంగా భర్తీ చేసింది కేంద్రం. ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) ఎబి పాండేకు జిఎస్‌టిఎన్ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నాం. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయి. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ఈ బాధ్యతలు కొనసాగుతాయి.’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవిన్యూ విభాగం ఓ ప్రకటన జారీ చేసింది.