బిజినెస్

పెట్టుబడుల ఉపసంహరణలో విదేశీ మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: భారతీయ స్టాక్ మార్కెట్లకు వివిధ దేశాలకు చెందిన పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ) నెమ్మదిగా దూరమైపోతున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్ల నుంచి దాదాపు 3,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోవడమే దీనికి నిదర్శనం. దేశీయంగా ఉన్న పలు ఆందోళనలతోపాటు అంతర్జాతీయ స్థాయలో నెలకొన్న విపత్కర పరిస్థితుల మధ్య విదేశీ మదుపరులు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారు. అయతే రుణ మార్కెట్లలోకి మాత్రం ఇదే సమయంలో 2,700 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు రావడం గమనార్హం. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ప్రస్తుతం రక్షణ లేదన్న అభిప్రాయానికొచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లలోకి వాటిని తరలిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ప్రథమార్ధంలో ఏకంగా 23 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయ. నిరుడు జనవరి-జూన్ మధ్య కేవలం 1.2 బిలియన్ డాలర్ల (7,600 కోట్ల రూపాయలు) పెట్టుబడులే వచ్చాయ. కాగా, ఈ సంవత్సరం జనవరి మినహా, ఫిబ్రవరి నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతూనే ఉన్నాయ. ఫిబ్రవరి-జూలై మధ్య దేశీయ రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 1.16 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. జనవరిలో 2,300 కోట్ల రూపాయల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. అలాగే జనవరిలో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి 1,200 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వెనక్కిపోగా, ఫిబ్రవరి-జూలై మధ్య 62,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. అయతే గత నెల ఆగస్టులో మాత్రం 12,770 కోట్ల రూపాయల పెట్టుబడులను భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్నారు. ఉత్తర కొరియా భయాలు విదేశీ మదుపరుల పెట్టుబడులను దెబ్బతీస్తున్నాయని నిపుణులు పెట్టుబడుల సరళిని విశే్లషిస్తున్నారు.