బిజినెస్

జియో నుంచి బంపర్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశీయ టెలికామ్ సేవల మార్కెట్‌లో పెను సంచలనాలతో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో దీపావళి పండుగ సందర్భంగా తమ ప్రీపెయిడ్ ఖాతాదారులకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ‘దీపావళి ధన్ ధనా ధన్’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఆఫర్ కింద వినియోగదారులు 399 రూపాయలతో రీచార్జి చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ నెల 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని, ఈ క్యాష్ బ్యాక్ వోచర్ల రూపంలో లభిస్తుందని, ఈ వోచర్లను ఉపయోగించుకుని ఖాతాదారులు మళ్లీ తమ ఖాతాలను రీచార్జి చేసుకోవచ్చని ఆ సంస్థ వివరించింది. ప్రస్తుతం 399 రూపాయలతో రీచార్జి చేసుకుంటున్న రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ఖాతాదారులకు రోజుకు 1జీబీ చొప్పున 84 రోజుల పాటు మొత్తం 84 జీబీ డేటాను ఇవ్వడంతో పాటు ఉచితంగా ఎస్‌ఎంఎస్‌లను, ఉచిత కాలింగ్ వసతిని కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తీసుకొచ్చిన ‘దీపావళి ధన్ ధనా ధన్’ ఆఫర్‌లో ఖాతాదారులు ఈ నెల 12 నుంచి 18వ తేదీ మధ్య 399 రూపాయలతో రీచార్జి చేసుకుంటే వారికి రూ.50 విలువ కలిగిన 8 వోచర్లు (మొత్తం రూ.400 విలువైన వోచర్లు) వస్తాయి. ఈ వోచర్లను ఉపయోగించుకుని ఖాతాదారులు మళ్లీ రీచార్జి చేసుకోవచ్చు. అయితే నవంబర్ 15వ తేదీ తర్వాత మాత్రమే వీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. రూ.309, అంతకంటే ఎక్కువ ప్లాన్‌కు మాత్రమే ఈ ఓచర్లు వర్తిస్తాయి. ఇప్పటికే ఏదైనా జియో ప్లాన్‌ను ఉపయోగించుకుంటున్న వారు ఈ ఆఫర్‌ను తీసుకుంటే ప్రస్తుత ప్లాన్ ముగిసిన తర్వాతే ఈ కొత్త ఆఫర్ ప్రారంభమవుతుంది.