బిజినెస్
నూతన శ్రేణి డీజిల్ జనరేటర్లను ఆవిష్కరించిన మహీంద్రా పవరోల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 9 December 2017
హైదరాబాద్, డిసెంబర్ 8: మహీంద్రా గ్రూప్లో భాగమైన మహీంద్రా పవరోల్ అత్యధిక కెవిఏ డీజిల్ జనరేటర్స్ (డిజి)ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. 250/320 కెవిఏ డిజిల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పవరోల్ అండ్ స్పేర్స్ బిజినెస్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా మాట్లాడుతూ చెన్నైలోని మహీంద్రా ఆర్ అండ్ డి కేంద్రం మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ వద్ద డిజైన్ చేయబడిన ఈ ఇంజిన్ను పూనె సమీపంలోని చకన్ ప్లాంట్ వద్ద తయారు చేశారని తెలిపారు. 250 కెవిఏ డీజిల్ జనరేటర్ ధర రూ.12.5 లక్షలు, జిఎస్టి కలిగి ఉండగా, 320 కెవిఏ డీజిల్ జనరేటర్ ధర రూ.16 లక్షలు ఉందని, ఇందుకు జిఎస్టి అదనంగా ఉంటుందని తెలిపారు. వినియోగదారులను ఈ జనరేటర్లు ఆకట్టుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.