బిజినెస్

ఏపీలో పైలెట్ ప్రాజెక్టు ఏర్పాటుకు సుజ్లాన్ గ్రూపు ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సుజ్లాన్ గ్రూప్ సీఎండీ తుల్సి తంతి దావోస్‌లో మంగళవారం సమావేశమయ్యారు. పవన, సౌర, గ్యాస్ ఆధారిత విద్యుత్ రంగాల్లో తమ భవిష్యత్ విస్తరణ ప్రణాళికల గురించి ముఖ్యమంత్రికి తుల్సి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తమ సంస్థకు గ్యాస్ కేటాయింపుల అంశాన్ని పరిష్కరించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. పునరుత్పాదక విద్యుత్ నిల్వ అంశంలో భారీ పరిశోధనలు చేస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీలో పైలెట్ ప్రాజెక్టు ఏర్పాటుకు సుజ్లాన్ గ్రూప్ ఆసక్తి కనబరిచింది. ముఖ్యమంత్రితో మంత్ర డాటా సెంటర్స్ బోర్డ్ మెంబర్ మోహన్ చైనాని కలిసి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో డాటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రికి మోహన్ తెలిపారు. అందుకు అవసరమైన భూమి, విద్యుత్, ఫైబర్ వసతులు కల్పించాలని సీఎంను కోరారు. గూగుల్, యాక్సెంచర్ డాటా సెంటర్లు కూడా ఏపీలో ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. కావాల్సిన అన్ని అనుమతులు 21రోజుల్లో కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.