బిజినెస్

ఏబీబీ అధ్యక్షుడితో ముఖ్యమంత్రి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: ఏబీబీ అధ్యక్షుడు చున్యున్ గుతో ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లో సమావేశమయ్యారు.
సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ రంగాల్లో ఏపీ అనుసరిస్తున్న నూతన విధానాలను, అమరావతిలో కాలుష్య రహిత విద్యుత్ వాహనాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు.
రాష్ట్రంలో రెండో తరం విద్యుత్ రంగ సంస్కరణలు అమలుతో విద్యుత్ వినియోగం పెరిగినా బిల్లులు పెరగకుండా చేశామని, నాణ్యమైన, స్వచ్ఛమైన విద్యుత్ కోసం సౌర, పవన విద్యుత్‌లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని, అందుకోసం అత్యుత్తమ విధాన నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. తమ తయారీ కేంద్రాన్ని ఏపీలో నెలకొల్పాలని ఏబీబీ సంస్థను ఆహ్వానించగా, ఏపీ పాలసీలను అధ్యయనం చేసి తయారీ కేంద్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని చున్యున్‌గు సీఎంకు హామీ ఇచ్చారు.