బిజినెస్

41 లక్షల ఖాతాలు రద్దు చేసిన ఎస్బీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 మాసాల కాలంలో ఎస్బీఐ దేశవ్యాప్తంగా 41.16 లక్షల ఖాతాలు రద్దు చేసింది. ఖాతాదార్లు బ్యాంకు నిర్దేశిత కనీస నిల్వను నిర్వహించకపోవడమే ఇందుకు కారణం. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద రద్దు చేసిన ఖాతాలపై సమాచారం కోరినప్పుడు, ఎస్బీఐ అధికారి ఒకరు లేఖద్వారా వివరాలు వెల్లడించారు. కనీస నిల్వ లేనపుడు విధించే చార్జీలను 75 శాతం వరకు తగ్గిస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకున్న రోజే నివేదిక బహిర్గతం కావడం గమనార్హం. బ్యాంకు తాజా నిర్ణయం ప్రకారం మెట్రో, అర్బన్ కేంద్రాల్లో ఖాతాల్లో
ఉంచాల్సిన కనీస నిల్వలను నిర్వహించనట్లయితే విధించే చార్జీలను నెలకు రూ.50 ప్లస్ జీఎస్టీ నుంచి రూ.15 ప్లస్ జీఎస్టీకి తగ్గించింది. ఇక సెమీ-అర్బన్, గ్రామీణ కేంద్రాల్లో చార్జీలను నెలకు రూ.40 ప్లస్ జీఎస్‌టీ నుంచి, రూ.12 ప్లస్ జీఎస్‌టీ మరియు రూ.10 ప్లస్ జీఎస్టీకి తగ్గించింది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. కనీస నిల్వలు నిర్వహించని ఖాతాదార్లపై ఎస్బీఐ విధించే ప్రస్తుతం విధిస్తున్న నెలవారీ చార్జీలు, మెట్రోల్లో రూ.3000, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.2000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 ఉంటున్నాయి. ఆరేళ్ల తర్వాత ఎస్బీఐ నెలవారీ సగటు బ్యాలన్స్ చార్జీలను, 2017 ఏప్రిల్ 1నుంచి అమలు పరుస్తోంది. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో బ్యాంకు వెనక్కి తగ్గింది.
రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ ఎండి పి.కె. గుప్త మంగళవారం మాట్లాడుతూ ‘మా కస్టమర్లనుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే కస్టమర్లు రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ (బీఎస్‌బీడీ) ఖాతాకు మారే వెసులుబాటు కల్పించాం. ఇందులో ఏవిధమైన చార్జీల విధింపు ఉండదు’ అన్నారు.