బిజినెస్

నిర్మాణ రంగంపై స్టీల్ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, ఏప్రిల్ 9: నిర్మాణ రంగంపై ఉక్కు పిడుగు పడింది. ఇన్నాళ్లు ఊసురుమన్న నిర్మాణ రంగం ఎట్టకేలకు పుంజుకుంటున్న సమయంలో ఉక్కు ధరలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ధరలు బాగా పెరగటంతో నిర్మాణదారులను ఇబ్బందుల్లోకి నెట్టింది. మార్చి చివరి నాటికి టన్ను ధర సాధారణ కంపెనీల ఉక్కు రూ. 53వేలు, బ్రాండెడ్ కంపెనీల ఉక్కు రూ. 60 వేలకు చేరిందనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. ఈమారు పెరిగిన ధరలతో నిర్మాణదారుల్లో ఆందోళన మొదలైంది. స్టీల్ కోసం నిర్మాణ దారులు వ్యాపారులకు ముందస్తు డబ్బులు ఇస్తే తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఎప్పుడు ధర పెరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని వారు పేర్కొంటున్నారు. అయితే జనవరిలో బ్రాండెడ్ కంపెనీ ఉక్కు క్విం టాలు ధర రూ. 3750, సాధారణ కంపెనీల ఉక్కు రూ. 3500 వరకు ఉండేది. ప్రస్తుతం బ్రాండెడ్ కంపెనీల ఉక్కు ధర రూ. 6000, సాధారణ కంపెనీల ఉక్కు ధర స్థాయిని బట్టి రూ. 4850 నుండి రూ. 5300 వరకు పెరిగింది. ఒక్కో క్వింటాలు మీద సుమారు రూ. 1000కి పైగా టన్నుకు రూ. 10 వేలకు పైగా పెరగటంతో ఇప్పుడిప్పుడే నిర్మాణాలు మొదలు పెడుతున్న వారికి అదనపు భారం మోయాల్సిన పరిస్థితి వచ్చిందనే వ్యాఖ్య లు వ్యక్తం అవుతున్నాయి. ఇదేక్రమంలో ఇప్పటికే నిర్మాణాలు సగం వరకు పూర్తి చేసుకున్న వారు పనులు ఆపలేక ఎక్కువ ధరకైనా ఉక్కు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.