బిజినెస్

సరిదిద్దలేని సమస్యేమీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 12: భారత్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను సరిగా అమలు చేయవచ్చునని, అది పరిష్కారం లేని సమస్యేమీ కాదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది బాగా ఆలోచించి, ప్రణాళికాబద్ధంగా చేసిన పని కాదని ఆయన పునరుద్ఘాటించారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్‌టీ, నోట్ల రద్దు వంటి సంస్కరణల గురించి ఆయన మాట్లాడుతూ, ఇలాంటి చర్యలు సరిగా అమలు చేస్తే బాగుంటాయని అన్నారు. 3ప్రస్తుతం అమలు చేస్తున్న దానికన్నా మెరుగ్గా అమలు చేయగలిగి ఉంటే జీఎస్‌టీ బాగుండేది. అయితే, జీఎస్‌టీ అనేది సరిదిద్దలేని సమస్యేమీ కాదు. ఇప్పుడే నేను దీనిపై విశ్వాసాన్ని వదలుకోను2 అని రాజన్ కేంబ్రిడ్జిలోని హార్వర్డ్ కెనె్నడీ స్కూల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. యూనివర్శిటి ఆఫ్ చికాగోకు చెందిన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆయన 3లెవరేజ్, ఫైనాన్షియల్ క్రైసిస్, అండ్ పాలిసీస్ టు రెయిజ్ ఎకనమిక్ గ్రోత్2 అనే అంశంపై 2018 ఆల్‌బెర్ట్ హెచ్ గోర్డోన్ లెక్చర్ ఇచ్చారు. భారత్‌లో భారీ సంస్కరణలయిన జీఎస్‌టీ, నోట్ల రద్దు వంటి వాటిని సరిగా అమలు చేయకపోవడంపై ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడానికి ముందు ఆర్‌బీఐని సంప్రదించలేదనే వాదనను రాజన్ తోసిపుచ్చారు. అయితే, మొత్తం కరెన్సీలో 87.5 శాతం విలువ కలిగిన నోట్లను రద్దు చేయాలనుకోవడం మంచి ఆలోచన కాదని ఆయన పునరుద్ఘాటించారు. 3నోట్ల రద్దుపై నన్ను సంప్రదించలేదని నేనెప్పుడూ చెప్పలేదు. నిజానికి, మమ్మల్ని సంప్రదించారని, అది మంచి ఆలోచన అని మేము భావించలేదనే నేను స్పష్టంగా చెప్పాను2 అని రాజన్ పేర్కొన్నారు. నోట్ల రద్దును బాగా ఆలోచించి, ప్రణాళికాబద్ధంగా అమలు చేయలేదని ఆయన అన్నారు. నోట్ల రద్దు గురించి తొలిసారి ఆలోచించినప్పుడే, అది ఉపయోగకరమైన చర్య కాదని తాను ప్రభుత్వానికి చెప్పానని రాజన్ వెల్లడించారు. ఒకవేళ 87.5 శాతం విలువ గల కరెన్సీని రద్దు చేయాలనుకుంటే, అంతమొత్తంలో కరెన్సీని తిరిగి చలామణిలోకి తెచ్చేందుకు ముద్రించి, సిద్ధంగా ఉంచాలని స్థూలార్థిక శాస్తవ్రేత్త ఎవరయినా చెబుతారు అని రాజన్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఇలా ప్రణాళికాబద్ధంగా చేయనుందు వల్లనే నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిందని ఆయన విశే్లషించారు.