బిజినెస్

రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆందోళనలో 30 వేలమంది ఫ్లాట్ల కొనుగోలుదారులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: తమ రిజిస్ట్రీ వద్ద రూ.100 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా ప్రముఖ రియాల్టీ సంస్థ జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్‌ను (జేఏఎల్) సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. డిపాజిట్ చేసేందుకు మే 10 వరకు గడువు ఇచ్చింది.
ఇదే సమయంలో చట్టం ప్రకారం, జేఏఎల్ ప్రతిపాదించిన పునరుద్ధరణ ప్రణాళికను పరిశీలించాల్సిందిగా, ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్‌పీ)ను సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. కాగా గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు ఏప్రిల్ 12నే రూ.100 కోట్లు డిపాజిట్ చేసామని సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. తమ పునరుద్ధరణ ప్రణాలికను పరిశీలించాలని కూడా సంస్థ కోర్టును అభ్యర్థించింది. నెలకు 500 గృహాలను పూర్తి చేస్తున్నామని వెల్లడించింది. ఇళ్లు కొనుగోలు చేసినవారికి తిరిగి చెల్లించడానికి వీలుగా రూ.200 కోట్లను తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు గత మార్చి 21న జేఏఎల్ సంస్థను ఆదేశించింది. ముఖ్యంగా ఫ్లాట్లకు బదులు డబ్బు కావాలనుకునేవారికి తిరిగి చెల్లించేందుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. అయితే వీటిని రెండు విడతలుగా డిపాజిట్ చేసేందుకు ఆనుమతించింది. ఇదిలావుండగా తాము ఇప్పటికే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద రూ.550 కోట్లు డిపాజిట్ చేశామని సంస్థ పేర్కొంది. తమ వద్ద ఫ్లాట్లు కొనుగోలు చేసిన 30వేల మందిలో కేవలం 8 శాతం మంది మాత్రమే తాము చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వాలంటున్నారని, మిగిలిన 92 శాతం మంది తమకు ఫ్లాట్లే కావలంటున్నారని కంపెనీ కోర్టుకు విన్నవించింది. ఇదిలావుండగా చిత్రా శర్మతో పాటు ఫ్లాట్ల కొనుగోలు దారులు కోర్టులో కంపెనీపై పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 32 వేల మంది జేఏఎల్ వద్ద ఫ్లాట్లు బుక్ చేసుకొని వాయిదాలు చెల్లిస్తున్నారని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన జేఎఎల్ కంపెనీపై ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించేందుకు ఐడీబీఐకి, ఎన్‌సీఎల్‌టీ అనుమతి ఇవ్వడంతో తాము గందరగోళంలో పడిపోయామని వారు పేర్కొన్నారు. కంపెనీ రూ.526 కోట్ల మేర రుణాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో ఈ ఇన్‌సావ్వెన్సీ ప్రొసీడింగ్స్‌కు ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది.