బిజినెస్

పేటీఎం ద్వారా నగదు బదిలీల్లో 40శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: హైదరాబాద్‌లో పేటీఎం ద్వారా నగదు బదిలీ లావాదేవీల్లో 40 శాతం వృద్ధి చోటు చేసుకుందని ఆ సంస్థ సివోవో కిరణ్ వాసిరెడ్డి తెలిపారు. ఒన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటమ్‌ను కిరాణ స్టోర్, పెట్రోల్ పంపులు, ఫార్మసీ, ఆటో,ట్యాక్సీ ఇతర సేవలను పొందినందుకు నగదు బదిలీకి ప్రజలు వినియోగించుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో రోజూవారీ లావాదేవీలను విశే్లషిస్తే పేటీఎం ద్వారా 40శాతం లావాదేవీలు వృద్ధిచెందినట్లు ఆయన చెప్పా రు. పేటీఎం యాప్‌ను సమర్ధంగా ప్రజలు వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఎటిఎంలు ఖాళీ కావడంతో పేటీఎం సేవలను వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తిని పెంచుకున్నారన్నారు. ప్రజలు నిత్యావసరాలకు పేటీఎంను వినియోగించుకుంటున్నారని ఆయన చెప్పారు.