బిజినెస్

400 మిలియన్ల సందర్శకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: భారతదేశపు సుప్రసిద్ధ ఫైనాన్షియల్ మార్కెట్ ప్లేస్ బ్యాంక్ బజార్.కామ్ ఈ ఏడాది 400 మిలియన్ల విజిటర్ల అంచనాలను ఆశిస్తున్నట్లు, వీరికి వాణిజ్య వివరాలను అందిస్తామని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి తెలిపారు. కొత్తగా ఈ ఏడాది 800 మందిని రిక్రూట్ చేయనున్నట్లు చెప్పారు. హైరింగ్‌తో క్లిష్టతలేని సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. హైరింగ్‌లో అధిక శాతం టెక్నాలజీ, ప్రోడక్ట్ డొమైన్స్‌లో ఉంటాయన్నారు. భారతదేశంలో 85కు పైగా ప్రైవేట్, పబ్లిక్ రంగ బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సి, బీమా కంపెనీల నుంచి విస్తృత శ్రేణి ఉత్పత్తులను బ్యాంక్ బజార్ అందిస్తుందన్నారు. గత త్రైమాసిక కాలంలో 90 మిలియన్ల సందర్శకులను పొందినట్లు చెప్పారు. తమ కంపెనీ 110 మిలియన్ డాలర్లను అమెజాన్, ఎక్స్‌పీరియన్స్, ఫిడెలిటీ గ్రోత్ పార్టనర్స్, వాల్డెన్ ఇంటర్నేషనల్ వంటి ఇనె్వస్టర్ల నుంచి సమీకరించినట్లు చెప్పారు.