బిజినెస్

మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ డీజిల్ కార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గురువారం భారత మార్కెట్‌లోకి తన 6 సిరీస్ గ్రాన్ టురిస్మో మోడల్ డీజిల్ వేరియంట్ కారును విడుదల చేసింది. దీని ధర రూ. 66.5 లక్షల నుంచి మొదలవుతుంది. స్థానికంగా తయారు చేసిన బీఎండబ్ల్యూ 630డీ గ్రాన్ టురిస్మో డీజిల్ కార్లు రెండు డిజైన్ స్కీమ్‌లు- లగ్జరీ లైన్, ఎం స్పోర్ట్‌లు ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా గల కంపెనీ డీలర్ల వద్ద లభ్యమవుతాయని ఆ కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. బీఎండబ్ల్యూ 630డీ గ్రాన్ టురిస్మో లగ్జరీ లైన్ (ఎక్స్-షోరూం) ధర రూ. 66.5 లక్షలు కాగా, బీఎండబ్ల్యూ 630డీ గ్రాన్ టురిస్మో ఎం స్పోర్ట్ ధర రూ. 73.7 లక్షలని ఆ కంపెనీ వివరించింది.