బిజినెస్

స్టాక్ మార్కెట్లలోకి ప్రథమార్ధంలో రూ. 20 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: విదేశీ మదుపరులు దేశీయ రుణ మార్కెట్ల కంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి- జూన్)లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపా యలకుపైగా పెట్టుబడులను తీసుకువస్తే, రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. గత నెల జూన్ విషయానికొస్తే స్టాక్ మార్కెట్లలోకి 3,713 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. రుణ మార్కెట్ల నుంచి 6,220 కోట్ల రూపాయలను పట్టుకుపోయారు. మే నెలలో కూడా 4,409 కోట్ల రూపాయల పెట్టుబడులను రుణ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకున్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలుగుతుందన్న భయాలు విదేశీ మదుపరులను రుణ మార్కెట్ల వైపు చూడనివ్వలేదు. బ్రెగ్జిట్‌కే బ్రిటనీయుల మద్దతు పలకడంతో మరింత దూరమయ్యారు. అయతే స్టాక్ మార్కెట్లలోకి మాత్రం పెట్టుబడులను కొనసాగించారు. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన ఎఫ్‌పిఐలు.. తర్వాతి మూడు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్లలోకి 32,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఎఫ్‌పిఐలు గుమ్మరించారు. వర్ష అంచనాలు, ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గింపు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. కాగా, అంతకుముందు రెండు నెలలతో పోల్చితే మే నెలలో వచ్చిన విదేశీ పెట్టుబడులు మాత్రం తక్కువే. 2,543 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే భారత స్టాక్ మార్కెట్లకు వచ్చాయ. ఇక జనవరి, ఫిబ్రవరిలో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకోగా, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య 41,661 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి 20,648 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అయతే రుణ మార్కెట్ల నుంచి 12,105 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. దీంతో నికర పెట్టుబడుల విలువ 8,543 కోట్ల రూపాయలుగా నమోదైంది.