బిజినెస్

త్వరలో కొత్త వంద రూపాయల నోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 19: త్వరలో కొత్త వంద రూపాయల కరెన్సీ నోటును విడుదల చేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మహాత్మాగాంధీ సీరిస్‌లో భాగంగా కొత్త నోటును విడుదలచేస్తారు. కొత్త వంద నోటు లావెండర్ (ఊదా) రంగు కలిగి ఉంటుంది. గుజరాత్‌కు చెందిన రాణి కీ వావ్ హెరిటేజ్ ప్రదేశాన్ని ఈ నోటుపై ముద్రిస్తారు. కొత్త నోటు సైజు 66ఎంఎం, 142 ఎంఎం. దశలవారీగా ఈ నోట్ల ముద్రణను పెంచి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. స్వచ్చ్ భారత్ లోగో, నినాదాన్ని ముద్రిస్తారు. మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో వంద రూపాయలనోటును విడుదల చేస్తారు. నోటు కుడివైపున అశోకుడి స్థూపం ఉంటుంది. కొత్తగా మైక్రో సెక్యూరిటీ ఫీచర్లను ఈ నోటులో పొందుపరచనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.