బిజినెస్
వరుసగా ఐదో సెషన్లోనూ లాభాల్లో సెనె్సక్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, డిసెంబర్ 17: ఈక్విటీలు వరుసగా ఐదో సెషన్లోనూ సోమవారం బెంచ్మార్కును అందుకుని లాభాల బాటలో నడిచాయి. 307 పాయింట్లు దక్కించుకుని ప్రధానంగా ఆటో, మెటల్, ఫైనాన్షియల్ స్టాక్స్లో ముదుపర్లు ప్రధానంగా పెట్టుబడులు పెట్టారు. అమెరికన్ డాలర్తో రూపాయి బలపడటం, సమత్యుల్యమైన వాణిజ్యలోటుతోపాటు విదేశీ నిధుల వెల్లువ ఇందుకు దోహదం చేశాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆసియన్ మార్కెట్లుకూడా పుంజుకున్నాయి.
బీఎస్ఈ సెనె్సక్స్ 0.85 శాతం వృద్ధితో 36,270 వద్ద ముగిసింది. గడచిన నాలుగు సెషన్లలో సెనె్సక్స్ 1,003.21 పాయింట్లు ఎగబాకడం గమనార్హం. అదేక్రమంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 0.77 శాతం ఆదాయంతో 83 పాయింట్లు దక్కించుకుని 10,888 వద్ద ముగిసింది. విదేశీ మదుపర్లు శుక్రవారం 861.94 కోట్ల రూపాయల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం డాలర్తో భారత రూపాయి విలువ 37 పైసలు పెరిగి 71.53 రూపాయలకు చేరింది.