బిజినెస్

వరుసగా ఆరో సెషన్‌లోనూ సూచీల లాభాల పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 18: సూచీలు ఇదివరకు వచ్చిన నష్టాలను సైతం అధిగమించి వరుసగా ఆరో సెషన్‌లోనూ మంగళవారం లాభాల బాటపట్టాయి. సెనె్సక్స్ 77 పాయింట్లు అదనంగా నమోదుచేసి 36,347 వద్ద ముగిసింది. చివరి నిమిషాల్లో పార్మా, లోహ, వౌలిక వస్తువుల నిల్వల్లో పేర్లను మదుపర్లు అమ్మకాలకు పెట్టడంతో కొంత వత్తిడికి గురయ్యాయి. అదే క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ స్థితిగతుల నేపథ్యంలో సమాచార సాంకేతిక రంగం, శీఘ్ర వినిమయ వస్తువుల రంగం నష్టాలను చవిచూశాయి. కాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 10,900 మార్కుకు ఎగబాకింది. ఈ సెషన్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు ముమ్మరంగా జరిగినప్పటికీ బీఎస్‌ఎ సెనె్సక్స్ 329 పాయింట్లతో లాభాలను సంతరించుకుంది. 30 షేర్లతో కూడిన ఈ ఇండెక్స్ మంగళవారం 36,226.38 వద్ద ప్రారంభమై అమ్మకాల వత్తిడితో ఒక దశలో 36.046.52కు దిగజారింది. వారం రోజులుగా దెబ్బతిన్న ఆసియన్ మార్కెట్లు ప్రభావం, యూరోపియన్ షేర్లు తక్కువ ఓపెనింగ్స్‌తో ఆరంభం కావడంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. అయితే మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో మార్కెట్ స్థితిగతుల్లో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి వరకు ఉన్న నష్టాలను అధిగమించి సెనె్సక్స్ స్కేలు 77.01 పాయింట్లు లాభపడి 36,375.38కి ఎగబాకింది. ఈ క్రమంలో గడచిన ఐదు సెషన్ల నుంచి సెనె్సక్స్ 1,310 పాయింట్లు లాభపడినట్టయింది. అలాగే 50 షేర్ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 20.35 పాయింట్లు లాభపడి 0.19 శాతంతో ఒక దశలో 10,908.70వద్దకు ఆ తర్వాత వరుసగా 10,819.10 వద్దకు, 10.915.40 వద్దకు చేరుకుని లాభాల పంట పండించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడం సూచీలకు ఊతమిచ్చిందని, దేశ దిగుబమతుల ఆర్థిక భారాన్ని తగ్గించడం ద్వారా స్థూల ఆర్థికాభివృద్ధికి సైతం ఈ పరిణామం సానుకూలంగా ఉందని విశే్లషకులు అంచనా వేశారు. అలాగే అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ బలపడడం కూడా మార్కెట్ మూడ్‌పై ప్రభావం చూపిందన్నారు. ఇక అంతర్జాతీయ స్టాక్ మార్కెట్‌లో మాత్రం గతరాత్రి నష్టాలు కొనసాగాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వు విధాన నిర్ణాయక విభాగం రెండు రోజుల సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కావడంతో ఇందుకు సంబంధించిన తుది నిర్ణయం ఈ నెల 19న వెలువడే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ధరలు పెరిగే సూచలున్న దృష్ట్యా మదుపర్లు వేచ్చిసే దోరణిని అవలంభించారు. ఇలావుండగా దేశీయ సంస్థాగత మదుపర్లు 76.64 కోట్ల రూపాయల విలువైన షేర్లను మంగళవారం అమ్మకాలు జరిపారు. అయితే విదేశీ పెట్టుబడిదార్లు 60.95 కోట్ల రూపాయల విలువైన షేర్లను సోమవారం అమ్మకాలు చేశారు.