బిజినెస్

భారీ స్టీల్‌ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 18: ఓ వైపు కడపలో ఉక్కు కర్మాగారానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే మరోవైపు రాష్ట్రంలో భారీ ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించేందుకు చైనా సంస్థ ముందుకొచ్చింది. సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏడాదికి 7 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం
ఏదైనా పోర్టు సమీపంలో రెండువేల ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. చైనా- ఇండియా స్టీల్ ప్లాంట్ ఇనె్వస్ట్‌మెంట్ ప్రాజెక్ట్ కింద తాము పెట్టుబడులు పెట్టదలిచామని చైనా స్టీల్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆసియా దేశాలతో వాణిజ్యం, భారతదేశంలో స్టీల్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించామని, ఇందుకు అత్యంత అనుకూల ప్రాంతమైనందునే ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు. ముడి ఇనుము, బొగ్గు గనులకు సంబంధించి తాము ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకున్నామని, వివిధ దేశాల్లోని పలు సంస్థలతో కూడా తమకు భాగస్వామ్యం ఉందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికతో మళ్లీ రావాలని ఆ సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాలు ఉంటాయని, అన్నిరకాల వౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జీ సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మంగళవారం ముఖ్యమంత్రితో భేటీ అయిన చైనా ప్రతినిధులు