బిజినెస్
ఎండీగా రాకేష్ శర్మ కొనసాగింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 January 2019
న్యూఢిల్లీ, జనవరి 21: సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా రాకేష్ శర్మను కొనసాగించాలని ఐడీబీఐ పాలక మండలి సోమవారం తీర్మానించింది. ఎల్ఐసీకి అనుబంధ సంస్థగా ఐడీబీఐ మారిపోయిన విషయం తెలిసిందే. ఐడీబీఐలో 51 శాతం వాటాలను కొనుగోలు ప్రక్రియను ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ ఇటీవలే పూర్తి చేసింది. ఎండీగా రాకేష్ శర్మతోపాటు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా కేపీ నాయర్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా జీఎం యాద్వాద్కర్ను వారివారి పదవుల్లో కొనసాగించాలని ఐడీబీఐ బ్యాంక్ పాలక మండలి నిర్ణయించింది. అదే విధంగా ఎల్ఐసీ ప్రతిపాదించిన డైరెక్టర్గా రాజేష్ ఖండ్వాల్ వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఆయన ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ కేర్ హోమ్స్ లిమిటెడ్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఉన్నారు.