బిజినెస్

ఓఎన్‌జీసీ షేర్ల విలువ రెండు శాతం పెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఓఎన్‌జీసీ షేర్ల విలువ మాత్రం రెండు శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం, మూడో త్రైమాసికంలో నికర లాభం 65 శాతం పెరిగినట్టు ఇటీవలే ఓఎన్‌జీసీ ప్రకటించింది. ఈ ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్‌లో స్పష్టంగా కనిపించింది. ఓఎన్‌జీసీ షేర్ 2.27 శాతం పెరగడంతో, బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో దీని విలువ 135.10 రూపాయలకు చేరింది. జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ ఓఎన్‌జీసీర్ల ధర 2.23 శాతం పెరిగింది. మొత్తం మీద ఒకేరోజు 19.25 లక్షల ఓఎన్‌జీసీ షేర్లు ట్రేడ్ అయ్యాయి. ఇలావుంటే, మూడో త్రైమాసికంలో నికర లాభం 65 శాతం పెరిగిందని ఓఎన్‌జీసీ ఇది వరకే ప్రకటించింది. దీని విలువ 8,262.70 కోట్ల రూపాయలుగా పేర్కొంది. దీనితో ఒక్కో షేర్ విలువ 6.44 రూపాయలు చొప్పున పెరిగిందని వివరించింది.