బిజినెస్

ఎస్‌టిపిసి ప్లాంటును సందర్శించిన సింగరేణి సిఎండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, మార్చి 28: సింగరేణి సిఎండి శ్రీ్ధర్ సోమవారం ఎస్‌టిపిసి విద్యుత్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంటులో జరుగుతున్న పనులను పూర్తిస్థాయిలో పరిశీలించారు. అనంతరం పనులు నిర్వహిస్తున్న 11 సంస్థల ప్రతినిధులతో సాయంత్రం వరకు సమీక్షించారు. ముఖ్యంగా విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి సాధ్యమైనంత త్వరలో విద్యుత్‌ను అందజేయాలని, ఇందుకోసం పనులు వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు. కాగా, పనులు వేగంగా సాగని సంస్థల ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తిచేయనట్లయితే వారిని బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కార్యక్రమంలో ప్లాంటు జిఎం సుధాకర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.