బిజినెస్

కస్టమర్లకు ఉత్తమ బ్యాంకింగ్ సేవలు అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కస్టమర్లకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందేందుకు ఎస్‌బీఐ కృషి చేస్తుందని ఆ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ మణి పాల్విసన్ చెప్పారు. మంగళవారం ఇక్కడ అమరావతి సర్కిల్‌కు సంబంధించి బ్యాంకు 64వ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు డిజిటల్ సేవలను అందించడంలో అగ్రగామిగా ఉందన్నారు. యోనో క్యాష్ సేవలు కస్టమర్లలో పాపులర్ అయినట్లు ఆయన చెప్పారు. జల సంరక్షణకు సంబంధించి ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుమేరకు బ్యాంకు సిబ్బంది తూచా తప్పకుండా అన్ని మార్గదర్శకాలను పాటిస్తారన్నారు. ఇంటి నుంచే ప్రతి ఒక్కరు నీటి పొదుపును నేర్చుకోవాలన్న విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్రమాజీ హోంశాఖ మంత్రి పద్మనాభయ్య, పద్మశ్రీ డాక్టర్ ఏ గోపాలకృష్ణ గోఖలేను బ్యాంకు అధికారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ బీవీఎస్‌కేటీ భాస్కర్, కే లక్ష్మణరావు, డీజీఎం ఎస్‌ఎన్ కులకర్ణి పాల్గొన్నారు.
చిత్రం... కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, పద్మశ్రీ గోపాలకృష్ణ గోఖలేను సత్కరిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు