బిజినెస్
మార్క్ఫెడ్కు ఉలవలు, సోయా సేకరణ బాధ్యత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 August 2019
హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణ రాష్ట్రంలో 2019-20 సంవత్సరానికి సంబంధించి సోయాబీన్, ఉలువల ఉత్పత్తులను రైతుల నుండి కొనుగోలు చేసే బాధ్యతను టీఎస్ మార్క్ఫెడ్కు అప్పగించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు సోయాబీన్, ఉలువలను కొనుగోలు చేస్తారు. వీటి కొనుగోలు సందర్భంగా మార్కెట్ ఫీజును, రాష్ట్ర పన్నులను మినహాయించారు.
దాంతో రైతులకు లబ్ది చేకూరుతుందని వెల్లడించారు.