బిజినెస్

ఎల్‌పీజీ, పెట్రోల్ బంకులకు వన్ టైమ్ లైసెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: ఎల్‌పీజీ, పెట్రోల్ బంకులు, కిరోసిన్ డీలర్లు ఇక నుంచి ప్రతి ఏడాది లైసెన్స్ రెన్యువల్ నుంచి మినహాయింపుఇస్తూ తెంలగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి లైసెన్స్ తీసుకున్నవారు ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా వన్ టైమ్ లైసెన్స్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పౌరసరఫరాల శాఖ నుంచి డీలర్ ప్రతి ఏడాది లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకోవాలన్న నిబంధన అమల్లో ఉండేది. దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని, వన్ టైమ్ లైసెన్స్‌కు ఆవకాశం కల్పించాలని పెంట్రోల్ బంక్, కిరోసిన్, ఎల్‌పీజీ డీలర్లు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల శాఖ అధ్యయనం చేసి వన్ టైమ్ లైసెన్స్ ఇవ్వడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదని ప్రభుత్వం దృష్టికి పౌరసరఫరాల శాఖ తీసుకువచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ వన్‌టైమ్ లైసెన్స్‌కు ఆమోదం తెలిపారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ జీవో నెంబర్ 15ను విడుదల చేసింది. రాష్ట్రంలో దాదాపు 2553 పెట్రోల్ బంకులు, 723 ఎల్‌పీజీ డీలర్లు, 900 వరకు ఉన్న కిరోసిన్ డీలర్లకు ఈ జివో వల్ల ప్రయోజనం చేకురుతుంది.