బిజినెస్

తెలంగాణకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 5: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెతో ఆంధ్ర ప్రయాణికులకు సాధ్యమైనంత మేర ఇబ్బందుల్లేకుండా ఏపీఎస్ ఆర్టీసీ యుద్ధప్రాతిపదికన ప్రత్యేక బస్సులను రోడ్డు పైకి ఎక్కించింది. దసరా పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసం 130 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని కృష్ణా రీజినల్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. గత రాత్రి నుంచి ఈ ప్రత్యేక బస్సులు హైదరాబాద్‌కు బయలుదేరటం ప్రారంభమై వెంటనే వెనక్కి తిరిగి రావడం కూడా ఆరంభమైందన్నారు. వీటిల్లో కొన్ని బస్సులను భద్రాచలం, సత్తుపల్లి, ఖమ్మంకు కూడా నడుపుతున్నామన్నారు. ఇదిలా ఉండగా విజయవాడలోని కార్పొరేట్ జూనియర్‌కు కళాశాలల హాస్టళ్లు శనివారం మూతబడటంతో రాయలసీమ వైపు వెళ్లే విద్యార్థుల కోసం 20 బస్సులను అలాగే రాజమండ్రి, విశాఖ, భీమవరం, అమలాపురం వైపు 60 ప్రత్యేక బస్సులను నడిపించారు.