బిజినెస్

ధర్మశాలలో పెట్టుబడిదారుల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండి, అక్టోబర్ 5: హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో పెట్టుబడిదారుల సమావేశం వచ్చేనెల 7, 8 తేదీల్లో జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు హాజరవుతారు. వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొంటారు. దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు. వివిధ కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ అతి పెద్ద సదస్సుకు విశేష, విస్తృతమైన ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులు భారతదేశం వైపు మొగ్గుచూపేలా ఈ సదస్సు మార్గదర్శకం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.