బిజినెస్

గృహ నిర్మాణాలపై రూ.900 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గృహ నిర్మాణం కోసం 900 కోట్ల రూపాయలు పెట్టుబడిగా ఉంచాలని ప్రముఖ రియాలిటీ సంస్థ మిగ్‌సన్ గ్రూప్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో 2,326 గృహాలను నిర్మిస్తున్నట్టు ఈ సంస్థ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వీటిలో 850 గృహాలను కేటాయిస్తామని పేర్కొంది. ప్రాజెక్టు మొత్తం 30 లక్షల చదరపు అడుగులని తెలిపింది.
ఒక్కో అపార్ట్‌మెంట్‌ను 35 లక్షల రూపాయల వంతున విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఐదేళ్ల కాలంలో నిర్మాణాలు పూర్తవుతాయని సంస్థ వివరించింది.