బిజినెస్

ఒక్క రోజులో రూ. 2.73 లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడడంతో మదుపర్ల సంపద ఒక్క రోజులోనే రూ. 2.73 లక్షల కోట్లు పెరిగింది. 30 షేర్ల సూచీ సెనె్సక్స్ నాలుగు నెలల గరిష్టం 581.64 పాయింట్లు ఎగబాకిన క్రమంలో బీఎస్‌ఈ జాబితాలోని కార్పొరేట్ కంపెనీల మార్కె ట్ విలువ ఒక్క రోజులోనే రూ. 2,73,355.21 కోట్లు పెరిగి మొత్తం రూ. 1,52,04,693.34 కోట్లకు చేరింది. కమిడ్, స్మాల్ క్యాప్ విలువ ఆకర్షణీయంగా ఉండ డం వల్ల మదుపర్లు సానుకూలంగా స్పందించారని, కొంత క్లిష్టతర సవాళ్లను స్వీకరించేందుకు సైతం సిద్ధమయ్యారని విశే్లషకులు చెబుతున్నారు. బ్రెగ్జిట్ డీల్ పురోగతితో అంతర్జాతీయ మార్కెట్లపై కమ్మిన మందగమన మేఘాలు సైతం తొలగిపోవడం ఆరంభమైందని అంటున్నారు.