బిజినెస్

పెరిగిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: బులియన్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల బంగారం ధర 115 రూపాయలు పెరిగి, 39,017 రూపాయలకు చేరింది. 38,902 రూపాయల ప్రారంభ ధరతో మొదలైన ట్రేడింగ్‌లో లాభాల్లోనే నడిచింది. రూపాయి మారకం విలువ స్వల్పంగా పతనం కావడంతో, పసిడికి డిమాండ్ పెరిగింది. మదుపరులు బులియన్ మార్కెట్‌పై ఆసక్తి చూపడంతో, బంగారం ధర పెరిగింది. కాగా, కిలో వెండి ధర 95 రూపాయలు పెరిగి, 47,490 రూపాయల వద్ద ముగిసింది.