బిజినెస్

రూ.287 కోట్ల శ్రీనిధి రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 12: రాష్ట్రంలో లక్ష్యాలకు మించి శ్రీనిధి రుణాలు ఇచ్చారు. పేద మహిళలు జీవనోపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేద మహిళలు వడ్డీ వ్యాపారుల బారినపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా ఈ పథకం ఉపయోగపడుతోంది. స్వయం సహాయక బృందాలకు ఈ పథకం ఓ వరంగా నిలిచింది. పాడి పశువుల కొనుగోలుకు, చిరు వ్యాపారం వంటి వాటికి రూ.75 వేల వరకు రుణం ఇస్తారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ రుణాలు దోహదపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 6,13,716 మందికి 1100 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆగస్టు వరకు 1,79,689 మందికి లక్ష్యాలకు మించి రూ.286.29 కోట్లు రుణాలుగా ఇచ్చారు. అత్యధిక మొత్తంలో రుణాలు ఇచ్చిన జిల్లాల్లో చిత్తూరు, కడప జిల్లాలు 1,2 స్థానాల్లో నిలిచాయి. చిత్తూరు జిల్లాలో ఆగస్టు వరకు 46.67 కోట్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, 48,568 కోట్లు, కడప జిల్లాలో 23.34 కోట్లు లక్ష్యం కాగా 37.44 కోట్లు ఇచ్చారు. ఈ రెండు జిల్లాలతో పాటు అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో లక్ష్యాలకు మించి రుణాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా రుణాల సంఖ్య, రుణ మొత్తం రెండింటిలో ఒక్క కడప జిల్లా మత్రమే అధిక్యంలో ఉంది. ఆగస్టు వరకు కడప జిల్లాలో 14,508 మందికి 23.34 కోట్లు రుణాలు పంపిణీ చేశారు. ఈ రుణాల ద్వారా గ్రామీణ మహిళలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. మొత్తం రుణాలు తీసుకున్న వారిలో 1,02,971 మంది గ్రామీణ మహిళలే ఉండటం విశేషం. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి గేదెల పెంపకం వంటి వాటితో పాటు చిన్న వ్యాపారాలు, టైలరింగ్, బ్యూటీ పార్లర్ వంటి వాటి ద్వారా వారు స్వయం ఉపాధి పొందుతున్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి శ్రీనిధి రుణాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.