బిజినెస్

సెబీ చైర్మన్ పదవి దక్కేదెవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 24: మార్కెట్ రెగ్యులేటర్ భారత సెక్యూరిటీలు, ఎక్స్ఛేంజి బోర్డు (సెబీ) చైర్మన్ పదవికి 24 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్థుల్లో ప్రస్తుతం సెబీలో పూర్తి స్థాయి సభ్యులుగా ఉన్న ఇద్దరు కూడా ఉన్నారు. ఈ పదవి కోసం దరఖాస్తు గడువు ఈనెల 10వ తేదీనే ముగిసింది. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్న విషయం తాజాగా వెల్లడైంది. ప్రస్తుతం మాజీ అధికారులు కూడా ఈ కీలక పదవికి పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత సెబీ చైర్మన్ అజయ్ త్యాగి మూడేళ్ల పదవీ కాలం ఈనెలాఖరుతో ముగుస్తుంది. అయితే, ఆయన మళ్లీ దరఖాస్తు చేసుకోలేదు. మొదట మూడేళ్ల పదవీకాలానికి గాను త్యాగిని నియమించినప్పటికీ మరో రెండేళ్లపాటు దీనిని పొడిగించేందుకు అవకాశం ఉంది. అయితే, ఆయన పదవీ కాలాన్ని పొడిగించకుండా కొత్త చైర్మన్ నియామకానికే మొగ్గు చూపిన కేంద్రం దరఖాస్తులు కోరుతూ గత నెల 24న ప్రకటన జారీ చేసింది. హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1984 ఐఏఎస్ అధికారి త్యాగిని సెబీ చైర్మన్‌గా 2017లో నియమించారు. కాగా, ఈ చైర్మన్ పదవికి దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు, అర్హతలను ఆర్థిక రంగం నియంత్రణ, నియామకాల పరిశోధనా కమిటీ శోధించి వడపోస్తుంది. ఈ కమిటీకి కేబినెట్ కార్యదర్శి అధ్యక్షుడుగా ఉన్నారు. షార్ట్ లిస్టయిన అభ్యర్థులను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సారథ్యంలోని ప్యానెల్ ఇంటర్వ్యూ చేస్తుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి సారథ్యంలోని నియామకాల కమిటీకి అభ్యర్థి పేరును సిఫారసు చేస్తారు.