బిజినెస్
కొత్త సిపిఎస్ఇ ఇటిఎఫ్కు మేనేజర్గా ఐసిఐసిఐ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, సెప్టెంబర్ 23: సుమారు రూ.6 వేల కోట్ల కార్పస్ నిధితో ప్రభుత్వ రంగ కంపెనీల స్టాక్స్తో ఏర్పాటు చేయబోయే రెండవ సిపిఎస్ఇ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్)ను నిర్వహించడానికి ప్రభుత్వం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ను మేనేజర్గా నియమించింది. ఈ ఫండ్ నిర్వహణకోసం పోటీ పడ్డ ఇతర ఫండ్ మేనేజింగ్ సంస్థల్లో రిలయన్స్ హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ, యుటిఐ, కోటక్, బిర్లా సన్లైఫ్ మ్యూచువల్ ఫండ్ కూడా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కొత్త ఇటిఎఫ్ను రూపొందించి ప్రారంభించడం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇనె్వస్ట్మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజిమెంట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజిమెంట్ కంపెనీని ప్రభుత్వం నియమించినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.