బిజినెస్
జిఎస్టి కౌన్సిల్ అదనపు కార్యదర్శిగా అరుణ్ గోయల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 September 2016
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: వస్తు సేవల పన్ను(జిఎస్టి) కౌన్సిల్లో అదనపు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ను నియమించారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ గోయల్ నియామకాన్ని ఆమోదించింది. సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గోయల్ ప్రస్తుతం కేబినెట్ సెక్రటేరియట్లో ప్రాజెక్ట మానిటరింగ్ గ్రూపు అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏకరీతి పన్ను వ్యవస్థను తీసుకు వచ్చేందుకు జిఎస్టి కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షుడుగాఉండే ఈ కౌన్సిల్కు ఇటీవలే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.