బిజినెస్

టిడిఎస్ చెల్లింపులపై ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: వేతన జీవుల్లో పన్ను చెల్లింపుదారులందరికీ తమ త్రైమాసిక టిడిఎస్ కోతలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ నుంచి ఇకపై ఎస్‌ఎమ్‌ఎస్‌లు రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఇక్కడ ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్ సర్వీస్‌ను ప్రారంభించారు. సిబిడిటి కూడా వేతన జీవులుకాని పన్ను చెల్లింపుదారుల కోసం త్వరలో ఈ పథకాన్ని అమలుపరుస్తుందని ఆయన ఈ సందర్భంగా విలేఖరులకు చెప్పారు. అయితే అది నెలవారీగా ఉంటుందని పేర్కొన్నారు. సిబిడిటి నెలనెలా ఎస్‌ఎమ్‌ఎస్‌లను అందిస్తుందని జైట్లీ వివరించారు.