బిజినెస్

బంగ్లాదేశ్‌కు సిఐఐ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 5: బంగ్లాదేశ్‌కు భారత ఎగుమతులను పెంచడంలో భాగంగా, అక్కడి వ్యాపారావకాశాలను అధ్యయనం చేయడానికి పారిశ్రామిక సంఘం సిఐఐ బృందం ఆ దేశంలో పర్యటించనుంది. ఈ నెల 8 నుంచి 10 వరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను 13 మంది సభ్యుల సిఐఐ ఈస్టర్న్ రీజియన్ డెలిగేషన్ సందర్శిస్తోంది. ఈ బృందానికి సిఐఐ ఈస్టర్న్ రీజియన్ ఇనె్వస్ట్‌మెంట్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ అరుణ్ మిశ్రా నేతృత్వం వహిస్తారు. విద్యుత్, మైనింగ్, ఎలక్ట్రానిక్స్, స్టీల్, టెక్స్‌టైల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌కేర్, తేలికపాటి ఇంజినీరింగ్, నైపుణ్యం, విద్యా రంగాలను పరిశీలించనుంది.