బిజినెస్
ఏపి సదరన్ డిస్కాంతో మొబిక్విక్ ఎంఒయూ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 November 2016
హైదరాబాద్, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను ఇకపై కేవలం సెకన్ల వ్యవధిలోనే నగదు రహితంగా చెల్లించవచ్చును. దేశంలో అతిపెద్ద ఇండిపెండెంట్ డిజిటల్ వాలెట్ మొబిక్విక్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఏపి ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశాన్ని వినియోగించుకోవాలని మొబిక్విక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మృణాల్ సిన్హా తెలిపారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఏపిలోని ఆరు జిల్లాల్లోగల 442 మండలాల్లో పంపిణీ నెట్వర్క్ ఉంది. తమ సంస్థ దేశంలో 27 డిస్కాంల ద్వారా విద్యుత్ చెల్లింపులను స్వీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు.