క్రైమ్/లీగల్

వ్యాపారి మృతిపై మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మార్చి 10: అనుమానాస్పద స్థితిలో వ్యాపారి మృతిచెందిన సంఘటన పట్టణంలోని పరిగి రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 9:30గంటలకు వెంకటేశ్వర కాలనీలోని తన నివాసం నుంచి మృతుడు షాపునకు వెళ్తున్నానని చెప్పి వెళ్లినట్లు భార్య మంజుల తెలిపారు. సోమవారం రాత్రి వరకు షాపుతోపాటు అన్ని ప్రాంతాల్లో ఎంత వేతికి ఆచూకీ లభించ లేదని, చివరకు షాపు కిందభాగంలో ఉన గోడౌన్‌లో మంగళవారం ఉదయం తాళం తీసి చూడగా అక్కడ ఫర్టిలైజర్ వ్యాపారి లక్ష్మయ్య(45) మృతిచెంది కనిపించినట్లు వివరించారు. షాద్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సైబరాబాద్ నుండి క్లూస్ టీంను రప్పించి పరిశీలించారు. ఆత్మహత్య చేస్తుకున్నాడా.. లేదంటే ఎవరైన హత్య చేశారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.