రాష్ట్రీయం

కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లో ఒక కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గురువారం గాంధీ భవన్ టిక్కెట్లు రాని ఆశావహుల ధర్నాలతో దద్ధరిల్లింది. సైదాబాద్ సమీపంలోని కుర్మగుడా డివిజన్‌కు చెందిన సీనియర్ కార్యకర్త కిషోర్ తన కుమార్తె టిక్కెట్ కోసం ప్రయత్నించారు. నామినేషన్ల గడువు ముగిసేలోగా బి-్ఫరం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు. దీంతో పెట్రోలు డబ్బాతో గాంధీ భవన్ ఆవరణలోకి పరుగెత్తుకుని వచ్చి, వంటిపై పెట్రోలు పోసుకున్నారు. ఇది గమనించిన ఒక ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరి ఆ కార్యకర్తపై బాటిల్‌తో నీళ్ళు పోశారు. వెంటనే మిగతా నాయకులూ కిషోర్‌పై బిందెలతో నీళ్ళు పోసి, మందలించి అక్కడి నుంచి పంపించారు.