జాతీయ వార్తలు
ప్రారంభించిన సీబీఐ ఆఫీసుకే విచారణకు...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 22 August 2019
న్యూఢిల్లీ: తాను కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన సీబీఐ కార్యాలయానికే విచారణకు హాజరైన శోచనీయమైన ఘటన మాజీ కేంద్ర మంత్రి చిదంబరం విషయంలో నేడు చోటుచేసుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో చిదంబరం హోం మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే 2011 జూన్ 30వ తేదీన ఢిల్లీలో చిదంబరం సీబీఐ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆనాటి కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. బుధవారం రాత్రి అదే కార్యాలయానికి సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు దీనికి సంబంధించిన కథనం, ఫొటోలను ఓ వార్తా సంస్థ వీడియోలో వెల్లడించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని పోలీసులు గోడ దూకి వెళ్లి పట్టుకున్న విషయం విదితమే.