ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ నేతల ఛలోదిల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఎపికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎపి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఛలోదిల్లీ ఆందోళన చేపట్టారు. ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శనివారం విశాఖ నుంచి దిల్లీకి బయలుదేరారు. రాష్టప్రతి, ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రయత్నిస్తామని రఘువీరా చెప్పారు. ప్రత్యేక హోదా, నిధుల కోసం కృషి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిస్తేజంగా ఉందని ఆయన ఆరోపించారు.