ఆంధ్రప్రదేశ్‌

నిజరూపంలో సింహాద్రి అప్పన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఏడాదిలో ఒకసారి మాత్రమే లభించే సింహాచలేశుని నిజరూపాన్ని సందర్శించి భక్తులు ఆనందపారవశ్యానికి లోనవుతున్నారు. చందనోత్సవం సందర్భంగా ఇక్కడి సింహాచలం కొండపై స్వామివారి నిజరూప దర్శనం సోమవారం తెల్లవారు జామునుంచి ప్రారంభమైంది. తొలుత ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, కేంద్రమంత్రి పి.అశోకగజపతిరాజు స్వామిని సందర్శించి చందనం, పట్టువస్త్రాలను సమర్పించారు. రాత్రి పదకొండు గంటల వరకూ భక్తులకు నిజరూప దర్శనం లభిస్తుంది. 11 గంటలకు సహస్ర ఘటాభిషేకం, ఇతర సేవల అనంతరం స్వామివారి విగ్రహానికి మూడు మణుకుల చందనం పూస్తారు. దీంతో చందనోత్సవం పరిసమాప్తమవుతుంది.