జాతీయ వార్తలు

జీఎస్‌టీ బిల్లుకు మరో 3 సవరణలు : చిదంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లును తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని, మరో 3 సవరణలు చేయాల్సి ఉందని ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం బుధవారం రాజ్యసభలో అన్నారు. సవరణలు అవసరమని తాము మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. సభ్యుల సంఖ్య ఆధారంగా కాకుండా చర్చల ద్వారా బిల్లును ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ బిల్లును భాజపా వ్యతిరేకించిందని చిదంబరం పేర్కొన్నారు. గడచిన 18 నెలలుగా ప్రధాన ప్రతిపక్షం ఆమోదం లేకుండా జీఎస్‌టీ బిల్లు ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. పార్లమెంటు ఆమోదంతోనే పన్నుల రేట్లలో మార్పులు చేయాలని సభకు అన్నారు.