జాతీయ వార్తలు
పార్లమెంటుకు వచ్చిన చిదంబరం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 5 December 2019
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి నిన్న సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో ఆయన విడుదల అయ్యారు. ఈరోజు శీతాకాల పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. కాగా చిదంబరం తమిళనాడు నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 106 రోజుల తరువాత తనకు స్వేచ్ఛ లభించిందని ఆయన సంతోషంగా తెలిపారు. ఉల్లి ధరలపై నిరసన వ్యక్తంచేస్తున్న కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఆయన కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.