సీక్వెల్‌లో ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్ హీరోగా గౌతంవాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ చిత్రం అప్పట్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాడట వెంకటేష్. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత జేమ్స్‌బాండ్ ఫేమ్ కిషోర్ తుమ్మల దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఇప్పటికే బాబుబంగారం సినిమాతో 73 చిత్రాలు చేసిన వెంకటేష్ తన 75 చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ‘ఘర్షణ’ చిత్రాన్ని సీక్వెల్ చేయాలని ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. ఇప్పటికే వీరిమధ్య చర్చలు కూడా జరిగాయని తెలిసింది. కిషోర్ తుమ్మల సినిమా తర్వాత ‘ఘర్షణ-2’ సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం వుంది.