పాటల్లో ఒక్క అమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో అంజిరెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో సాయి ధరమ్ తేజ్ సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వినాయక్, బోయపాటి శ్రీను, గుణశేఖర్, రాశీఖన్నా, రెజీనా, మేర్లపాక గాంధి, గౌతంరాజు పాల్గొన్నారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ, చాలా రోజుల క్రితమే రాజసింహ ఈ కథను చెప్పారని, ఈ సినిమాను ఆయనే తెరకెక్కించడం ఆనందంగా వుందని, చోటా కె నాయుడు ఈ సినిమాకు పనిచేయడంతో గ్రాండియర్ వస్తుందని అన్నారు. ముఖ్యంగా సందీప్, నిత్యాలను అభినందిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుందని అన్నారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ- నా మొదటి సినిమా ‘రేయ్’కు రాజసింహ డైలాగ్స్ రాశారని, తప్పకుండా ఈ సినిమా సందీప్‌కు మంచి విజయాన్ని అందిస్తుందని అన్నారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ, స్ర్తిలను గౌరవిస్తే అక్కడ దేవతలుంటారని చెప్పే సినిమా ఇదని, ఓ మంచి సినిమా తీయడానికి చేసిన ప్రయత్నమిదని, రాజసింహ తనపై పెట్టుకున్న నమ్మకానికి ఆనందంగా వుందని, ఖచ్చితంగా ఈ సినిమాలో నా బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ చూస్తారని అన్నారు. ముఖ్యంగా నిత్యామీనన్ నటన అద్భుతంగా ఉంటుంది అన్నారు. నిత్యామీనన్ మాట్లాడుతూ, ఒక్క నిమిషం కూడా బోర్ లేకుండా పర్‌ఫెక్ట్‌గా కథను తయారుచేశాడని, రాజసింహ కెరీర్‌లో మంచి సినిమా అవుతుందని, సందీప్ అద్భుతమైన నటుడని, మిక్కీ మంచి మ్యూజిక్ ఇచ్చాడని అన్నారు.