క్రైమ్/లీగల్
రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు: నేటికి వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 11 March 2020
హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. రేవంత్రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని, రేవంత్ తరపు న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. పాత కేసుల్లో రేవంత్పై పీటీ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) వారెంట్ను హైదరాబాద్ పోలీసులు అడిగారని, పోలీసుల తరపు లాయర్ పేర్కొన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కేసులు పెట్టారని శ్రీనివాసరావు తెలిపారు. ఇదే సాకుతో పీటీ వారెంట్ ఇస్తున్నారని, బెయిల్ ఇవ్వాలని రేవంత్ తరఫు లాయర్ శ్రీనివాస్రావు కోరారు. కూకట్పల్లి కోర్టు తీర్పు బుధవారానికి వాయిదా వేసింది.