దర్శకుడు విక్రం గాంధి కన్నుమూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 12 May 2016
శివాజీ హీరోగా ‘స్టేట్రౌడీ’, కమెడియన్ వేణుమాధవ్ కథానాయకుడిగా ‘ప్రేమాభిషేకం’ చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఎస్.ఎస్.విక్రం గాంధి (45) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా బ్రెయిన్ కాన్సర్తో బాధపడుతున్న ఆయన గన్నవరంలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. వందకుపైగా చిత్రాలకు కోడైరెక్టర్గా పనిచేసిన ఆయన, రెండు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. ఆయన అంత్యక్రియలు గురువారం గన్నవరంలో జరగనున్నాయి. విక్రం గాంధి హఠాన్మరణంపై టాలీవుడ్ సానుభూతి వ్యక్తం చేసింది.